అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం
Published: Thursday March 25, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీపీ నూతి రమేష్ రాజ్ బుధవారం రోజున శంకుస్థపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ప్రతి ఎంపిటిసి పరిధిలో రెండు లక్షలు కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నోముల మల్లేష్, ఉపసర్పంచ్ కందుల నరేష్, రేపాక సందీప్ రెడ్డి, వార్డు నెంబర్ గాడిపల్లి సంతోష రమేష్, పాశం సత్తిరెడ్డి, జంగం శంకరయ్య, గాడిపల్లి యాదయ్య, పంతంగి రాజు, కొండం అశ్విన్ కుమార్, నల్లమాస దయాకర్, బాలరాజు, పంచాయతీ కార్యదర్శి సాయిరాం రెడ్డి, దుబ్బు మహేష్, స్వామి, నర్సింహ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: