పొన్నకల్ చెరువు శిఖం కాపాడండి

Published: Friday February 11, 2022
ఐలవేని నర్సయ్య  ముదిరాజ్
జన్నారం రూరల్, ఫిబ్రవరి 10, ప్రజాపాలన : మండలంలోని పొన్కల్ ఊర్ర చెరువు సర్వేనెంబర్ 400లో అన్యాక్రాంతం మైన  చెరువు శిఖం భూమి కాపాడాలని ముదిరాజ్ యువసేన రాష్ట్ర కార్యదర్శి ఐలవేని నరసయ్య ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోన్కల్ చెరువు శిఖం 41.16 ఎకరాల గుంటలలోని కొంతభాగం కబ్జాకు గురైయిందని పేర్కొన్నారు. అధికారులు కజ్జాలను అరిక ట్టకపోతే చెరువు కనుమరుగై పోయి చిన్న కుంటగా మారే అవకాశం ఉంటుం దని అన్నారు. ఈ చెరువు పై ఆదారపడి సాగుచేసే పొలాలకు నీరు కరువు ఏర్పాడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా మత్స్య కార్మికులకు చెపల చెరువు లేకుండా పోతుందని, దీనిపై ఆదారపడి చేపలు పెంచుకునే మత్స్యకారులకు నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు, రైతులు, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.