జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Thursday September 15, 2022
వికారాబాద్ బ్యూరో 14 సెప్టెంబర్ ప్రజా పాలన : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని మున్నూర్ సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు బేరి సాయన్న, కన్నె పద్మమ్మ సీనియర్ నాయకులు అనంతయ్య, కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి. శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, రాంరెడ్డి, అనంతయ్య, లాలయ్య, మల్లేశం వారి అనుచరులు 20 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
** స్వరాష్ట్రంలో సంపూర్ణమైన సంక్షేమం : 
 బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులు పంపిణి చేశారు.
 ** గులాబీ జెండా తోనే ఘనమైన అభివృద్ధి :  బుధవారం వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో బంట్వారం మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లప్ప, అనంతి, పెంటప్ప, కృష్ణయ్య, బిచప్ప  వారి అనుచరులు 40 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ధరూర్ ఏఎంసీ చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా దారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ రాములు కౌన్సిలర్ లంకా పుష్పలత లక్ష్మీకాంత్ రెడ్డి కొండేటి కృష్ణ చింత కింది రామస్వామి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ రాజ మల్లయ్య టిఆర్ఎస్ యువ నాయకులు సుభాన్ రెడ్డి పాప గారి గోపి గాండ్ల మల్లికార్జున్ తదితర టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
 
▪️