సంగారెడ్డి జిల్లా లో పిఎంజిఎస్.వై. రోడ్ల జాతీయ నాణ్యత నిపుణులు బినయ్ కుమార్ సిన్హా తనిఖీ

Published: Wednesday December 15, 2021
హైదరాబాద్ 14 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి : ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పి.యం.జి.ఎస్.వై) పథకం కింద మంజూరైన రోడ్ల నాణ్యతను జాతీయ నాణ్యత నిపుణులు బినయ్ కుమార్ సిన్హా తనిఖీ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలో ప్రగతిలో ఉన్న ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా మంజూరైన పలు రోడ్ల నాణ్యతను జాతీయ నాణ్యత నిపుణులు బినయ్ కుమార్ సిన్హా మంగళవారం నాడు తనిఖీ చేశారు. సింగీతం నుండి మొరట్ గా వయా రాయిపల్లి కడ్చల్ 10 కిమీ రోడ్డు ను తనిఖీ చేశారు. మెటల్ బిటి గ్రావెల్ షోల్డర్ల నాణ్యతను డెన్సిటీ తేమ గ్రెడేషన్ మొదలగు వివిధ రకాల టెస్టు లను క్షేత్ర స్థాయిలో పరిక్షించారు. అంగ్రిమెట్ కాలపరిమితి లోపు పని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. రాయిపల్లి లోని క్వాలిటీ కంట్రోల్ లాబోరేటరిని తనిఖీ చేశారు. లాబ్ లో పరికరాలు సక్రమంగా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని పరికరాలు పనిచేసే విధంగా చూడాలని కాంట్రాక్టర్ కు సైట్ ఇంజనీర్లను ఆదేశించారు. ముందు రోజు కావాల్సిన అన్నింటినీ సమకూర్చుకోవాలి అలాంటి పద్ధతి పాటించడం లేదని అన్నారు. ఆందోల్ పంచాయతీ రాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజయ్య తాల్క ఆందోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావూరి రామారావు, అసిస్టెంట్ ఇంజనీర్ కోటయ్య, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ ఇంజనీర్  శశిధర్ రెడ్డి, కాంట్రాక్టర్ శివరాం సేట్,సైట్ ఇంజనీర్లు సిబ్బంది వెంట ఉన్నారు.