కార్పొరేషన్ మేయర్ పలు కాలనీల పర్యటన

Published: Thursday April 29, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : కరోనా మహమ్మారి వైరస్ విలయతాండవం చేస్తుంది, కావున ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కార్పొరేషన్ మేయర్ అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 17వ డివిజన్ లో పర్యటించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. బుధవారం నాడు పలు కాలనీల పర్యటనలో భాగంగా రఘు హోమ్స్ కాలనీలో శానిటేషన్ సిబ్బందితో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. నగర దీపిక లతో కలిసి శానిటేషన్ మరియు కరోనా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... కరోనా విలయతాండవం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆమె ప్రజలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతిఒక్కరూ తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలని అపోహలను నమ్మకుండా ధైర్యంగా వాక్సిన్ వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, నగర దీపికలు, సిబ్బంది. కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.