మానవత్వం చాటుకున్న టౌన్ ఎస్ఐ సతీష్

Published: Thursday April 13, 2023

కుమార్ మధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మానవత్వంవం చాటుకున్న టౌన్ ఎస్ఐసతీష్ కుమార్మంటల్లో చిక్కుకున్న వృద్ధురాలను చాకచక్యంగా కాపాడిన టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్.జిలుగుమాడు వద్ద ఎన్టీఆర్ విగ్రహం పక్కన గుడిసెకు నిప్పంటుకున్న వైనంఅదే గుడిసెలో 80 ఏళ్ల ముసలమ్మ (వజ్రమ్మ) మంటలో చిక్కుకున్న పరిస్థితి. మున్సిపాలిటీలోఒకటో వార్డు జిలుగుమాడు వద్ద జూనియర్ కాలేజ్ ఎదురుగా ఒక చిన్న పూరి గుడిసెలో 80 ఏళ్ల వజ్రమ్మనే ముసలమ్మ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. గుడిసె వెనకాల రెండు ప్రక్కల మంటలు చెల్లరేకడంతో అటుగా వెళుతున్న టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ గమనించి వెంటనే జీప్ దిగి గుడిసెలోకి వెళ్లి పరిశీలించగా వృద్ధురాలు వజ్రమ్మ మంటల్లో చిక్కుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ కనిపించింది వెంటనే ఎస్ఐ సతీష్ ఆ  వృద్ధురాలను ఎత్తుకొని బయటికి తీసుకువచ్చి వెంటనే ఫైర్ ఇంజన్ ఫోన్ చేసి మంటలు ఆర్పించి ఆ వృద్ధురాలను మంటల్లో నుండి కాపాడటం జరిగింది.

అదే సమయంలో అటుగా ఎస్సై వెళ్లకుండా ఉంటే దాదాపుగా ఆ ముసలమ్మ సజీవ దహనం అయి ఉండేదని అక్కడ ఉన్న స్థానికులు చెబుతూ టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.