మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్15, ప్రజాపాలన: వాసవీ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స

Published: Friday September 16, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్15, ప్రజాపాలన:
 
 వాసవీ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ముందు పౌర్ణమి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ ముందు ప్రతీ నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా దాత వుత్తూరి వేణుగోపాల్ అన్నపూర్ణ దంపతుల సహకారంతో అన్నదానంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్ , అంతర్జాతీయ ఉపాధ్యక్షులు కటుకం హరీష్, జిల్లా క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, రీజియన్ ఛైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ చైర్మన్ కాచం సతీష్, సభ్యులు చందూరి ప్రభాకర్, రమేష్, కొత్త కృష్ణ, పడకంటి శ్రీనివాస్, గంప నాగేందర్, కొలిపాక విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.