పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడు.
Published: Friday February 10, 2023
శంకరపట్నం ఫిబ్రవరి 09 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండలం మక్త గ్రామంలో నివసిస్తున్న యమ్ రాజు అనే యువకుడు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఏంటి సతీష్ రెడ్డి, పైలెట్ సదన్ రెడ్డిలు హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు తండ్రి శంకర్ బతుకుదెరువు నిమిత్తం తన స్వగ్రామమైన వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామం నుంచి మక్త గ్రామంలో డ్రైవర్ గా పని చేస్తు జీవిస్తున్నాడు.
Share this on your social network: