సేవయే మా లక్ష్యం సేవ యే మా మార్గం
Published: Monday August 23, 2021
మధిర, ఆగస్టు 22, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో, మధిర సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు కడు నిరుపేద కుటుంబాలకు వివిధ రకాల పనుల నిమిత్తం బయటికి వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఎండకు, వానకు, రక్షణ కొరకు దాత లార్విన్ గ్రూప్ డైరెక్టర్ చిరంజీవి మిరియాల దినేష్ ఆర్థిక సహకారంతో "గొడుగులు" పంపిణీ చేసినారు ఈ కార్యక్రమం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉపాధ్యక్షులు శ్రీ పుల్లఖండం చంద్ర శేఖర్, జిల్లా మాజీ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు, మరియు రిటైర్డ్ ఎం డి ఓ శ్రీ మాధవరపు నాగేశ్వరావు గార్ల చేతుల మీదుగా అత్యంత పేదలకు పంపిణీ చేసినారుఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పెద్దలు మధిర సేవా సమితి సేవా కార్యక్రమాలను కొనియాడుతూ కార్యక్రమాలకు మా యొక్క సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని పేదలకు సేవ చేయడం అంటే భగవంతుడికి చేసిన పుణ్యంలో ఒక భాగమని తెలిపారుఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం సెక్రెటరీ శ్రీ నాళ్ల శ్రీనివాసరావు గారు, సేవా సమితి సభ్యులు పల్లపోతు ప్రసాద రావు, కోమటిడి శ్రీనివాసరావు, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, చారు గుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, యర్రా లక్ష్మణ్, కోమటి సుధాకర్, బసవరాజు వాసుదేవరావు, చెడే రామకోటేశ్వరరావు, బండారు నరసింహారావు, వేములపల్లి పిచ్చయ్య పాల్గొన్నారు
Share this on your social network: