ఒకేసారి లక్ష వృక్షార్చన దిశగా పీర్జాదిగూడ కార్పొరేషన్

Published: Wednesday July 14, 2021
మేడిపల్లి, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సారద్యంలో కార్పోరేషన్ పరిధిలో మొక్కలు నాటే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. డివిజన్ల వారిగా కార్పొరేటర్లు ఇంటింటికి నిరంతరాయంగా మొక్కల పంపినిని చేస్తూ, హరిత పీర్జాదిగూడ నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నారు. అదేవిదంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలొ నిర్మాణం కానున్న రాచకొండ పోలిస్ కమీషనరేట్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే బృహద్కార్యానికి శ్రీకారం చుట్టారు. అందుకు కావలసిన మొక్కలను ఇప్పటికే సిద్దంచేశారు. లక్ష వృక్షార్చనకై జరుగుతున్న ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, మేయర్ జక్క వెంకట్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్ సుభాష్ నాయక్, సి.ఐ అంజి రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.