వరిదీక్షకు తరలిన ఉప్పల్ కాంగ్రెస్ నేతలు

Published: Monday November 29, 2021
మేడిపల్లి, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలనే డిమాండ్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వరదీక్షకు ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో తరలి వెళ్ళారు.ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు ఇందిరా పార్క్ వద్ద రెండో రోజు చేపట్టిన వరిదీక్షలో కూర్చొని రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోరంపేట కృష్ణ, జలీల్ పాశ, డివిజన్ అధ్యక్షులు కొంపల్లి బాలరాజ్, ప్రకాష్ రెడ్డి, బాకారం లక్ష్మణ్, సీనియర్ నాయకులూ సతి రెడ్డి, మంద మురళికృష్ణా రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, సుంకు శేఖర్ రెడ్డి, అస్లాం భాయ్, అలుగుల అనీల్ కుమార్, అల్వాల భాస్కర్, జనగాం రామకృష్ణ, నవీన్ యాదవ్, సందీప్, భాస్కర్, అలీం, గోరిగే మహేష్, రాంరెడ్డి, కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, రఘు గుప్తా, హనుమంతు, పీటర్, సతీష్, కన్నమైన నరేష్, పాలడుగు లక్ష్మణ్, బచ్చా రాం, తైసిన్ తదితరులు పాల్గొన్నారు.