పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించిన జడ్పీ సీఈఓ

Published: Tuesday June 14, 2022

బోనకల్, జూన్ 13 పాలన ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను జడ్పీ సీఈఓ వెంకట అప్పారావు మండల కేంద్రంలో సోమవారం పరిశీలించారు.ముందుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. క్రీడా ప్రాంగణానికి అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చటం జరిగిందని స్థానిక సర్పంచ్ భూక్య సైదా నాయక్ సీఈవో కు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్. ఓ బ్రిడ్జి కింద ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆర్ ఓ బ్రిడ్జి క్రింద చేపట్టనున్న పచ్చని మొక్కల పెంపకంతో పాటు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆర్. ఓ బి క్రింద అభివృద్ధి పనులలో భాగంగా బోరు ఏర్పాటు, సేద తీరేందుకు బల్లలు ఏర్పాటు చేయడంపై సర్పంచ్ భూక్య సైదా నాయక్ ను సి ఈ ఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు, ఎంపీడీఓ గొట్టిపాటి శ్రీదేవి, ఏ పి ఓ కృష్ణ కుమారి, ఆర్ఐ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి దామల్ల కిరణ్, ఉపాధి టిఏ సురేష్ తదితరులు పాల్గొన్నారు.