జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి
Published: Friday January 27, 2023
మేడిపల్లి, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి)
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 25వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి విహరిక,క్రాంతి కాలనీ కమ్యూనిటీ హాల్,శ్రీ సాయి నగర్ కమ్యూనిటీ హాల్,సాయి హిల్స్, కారల్ బ్యాడ్మింటన్ అకాడమీ,శ్రీ సాయి నగర్ కాలనీ కామన్ దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 25వ డివిజన్లోని విహరిక,శ్రీ సాయి నగర్,సాయి హిల్స్,క్రాంతి కాలనీల అధ్యక్ష కార్యదర్శులు,కాలనీ పెద్దలు,మహిళలు,నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: