భూగర్భ డ్రైనేజి పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి

Published: Friday May 07, 2021

ఐడీఏబొల్లారం, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : బొల్లారం మున్సిపల్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు, 22వ వార్డు ల్లో భూగర్భ డ్రైనేజి పనులను శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11వ వార్డు, 22వ వార్డు ల్లో భూగర్భ డ్రైనేజి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని, మురికి కాలువల సమస్యతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేంద్ర కుమార్, కౌన్సిలర్ లు శ్రీకాంత్ యాదవ్, ప్రమీల, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రశాంత్ పాల్గొన్నారు.