మధిర టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

Published: Tuesday August 24, 2021
మధిర, ఆగష్టు 23, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరూ కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ పరిధిలోని 9 మరియు10 వార్డు కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత దంపతులు కోరారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 9 మరియు 10 వార్డుల్లో ఏర్పాటు చేసిన కరోనా టీకా కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది మరియు 10 వార్డుల ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వార్డుల్లోనే కరోనా టీకా వేయించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ  కరోనా టీకా వేయడం జరిగిందని వర్ తెలిపారు. ప్రజలు అందరూ తప్పనిసరిగా కరోనా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ టీకా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సంధ్య అంగన్వాడీ టీచర్ గోవుల ఉషా ఆర్పీ నీరుకొండ ప్రతీమ, ఆశావర్కర్లు, జ్యోతి పాల్గొన్నారు.