విద్యార్థుల మృతి తీవ్ర విచారకరం డా.కోట రాంబాబు

Published: Monday November 21, 2022

మధిర రూరల్ నవంబర్ 20 ప్రజా పాలన ప్రతినిధి ఆదివారం నాడు  మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు నీలం జశ్వంత్, శీలం వెంకట నర్సిరెడ్డి నిన్న విహారయాత్ర కు వెళ్లి ప్రమాద వశాత్తు నీటమునిగి మరణించగా వారి మృతదేహాలకు టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు *డా.కోట రాంబాబువాళులు అర్పించి వారి కుటుంబాలను ఓదార్చారు. ఆ భగవంతుడు పిల్లల ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబాలకు ధైర్యం, ఓదార్పు ప్రసాదించాలని కోరి వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.