జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి.

Published: Wednesday February 15, 2023

శంకరపట్నం ఫిబ్రవరి 14 ప్రజాపాలన రిపోర్టర్


పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా హౌరా లో జరుగుతున్న అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు ఈనెల 15వ తేదీ నుండీ18 వరకు జరుగనున్నాయని ఈ మహాసభల ప్రతినిధి వడ్ల రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిర్వర్యం చేసే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కార్యచరణ రూపొందించుకొని రాబోయే రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన  తెలిపారు. ఉపాధి హామీ రోజుకు కూలి 600 రూపాయలు 200 రోజులు పని దినాలు కల్పించాలని, పని ప్రదేశాలలో వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మాసభలకు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. ఈ మహాసభలకు వడ్ల రాజును ఎన్నిక చేసినా రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీ కి రాజు కృతజ్ఞతలు తెలిపారు.