శ్రీశ్రీశ్రీ మాతా నిషాంబిక దేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సీతక్క

Published: Saturday October 01, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి)
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీశ్రీశ్రీ మాతా నిషాంబిక దేవి అమ్మవారిని ములుగు ఎమ్మెల్యే సీతక్క దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరిని అమ్మవారు చల్లగా ఉండేలా చూడాలని మొక్కారు. ఆధ్యాత్మికత వల్ల మానసిక ప్రశాంత ఏర్పడుతుందని,ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని దైవ చింతనలో ఉండలన్నారు.అనంతరం కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సీతక్కను శాలువాతో ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు పోగుల నర్సింహ్మ రెడ్డి, కొత్త స్రవంతి కిషోర్ గౌడ్,మేడ్చల్ నియోజకవర్గం బిబ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,మేడ్చల్ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ల ప్రశాంత్,కాంటెస్టడ్ కార్పోరేటర్ రాపోలు ఉపేందర్, నాయకులు ఆసర్ల బీరప్ప, రామగళ్ళ నర్సింగ్ రావు,సురేష్, అలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.