కేటీఆర్ జన్మదినం సందర్భంగా పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి

Published: Monday July 25, 2022
మేడిపల్లి, జూలై24 (ప్రజాపాలన ప్రతినిధి)
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని  
 పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లో మొక్కలు నాటారు. అనంతరం మాతృ అభయ అనాధాశ్రమంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పండ్లు పంపిణీ చేశారు.  అదేవిధంగా  అభయ హెల్త్ ట్రస్ట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు ,బ్రెడ్లు పంపిణీ చేశారు. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని 
 పీర్జాదిగూడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మరియు కేటీఆర్ ఆరోగ్యంగా తొందరగా కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి ,ఆదిత్య మోహన్, మహేష్, శ్యామ్ సుందర్ గుప్తా ,అంజిరెడ్డి, ధనుంజయ గుప్తా, హనుమంత్ రెడ్డి, రాజేందర్,నరసింహ, రవి, శేఖర్ ,రాధిక, జయశ్రీ పాల్గొన్నారు.