ఇంటర్ కళాశాలలుగా ఆరు కేజీబీవీ లు

Published: Thursday September 23, 2021
డిఐఈఓ శ్రీధర్ సుమన్
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాపాలన) : జిల్లాలోని ఆరు కేజిబీవి లను ఇంటర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు జిల్లా మాధ్యమిక విద్య అధికారి శ్రీధర్ సుమన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చే జారీ చేయబడిన ఉత్తర్వుల సంఖ్య 100, మంగళవారం 21 9 2001 తేదీ లో మొత్తం 36 కేజిబివీ లు అప్ గ్రేడ్ చేయబడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన "అస్పెరింగ్ జిల్లా " లో భాగంగా కుమ్రం భీం జిల్లా కు చెందిన చింతల మానేపల్లి, కేరమేరీ, రెబ్బెన, సిర్పూర్ యు, మండలాలలోని కేజీబీవీలో ఎంపీసీ 40, బైపిసి 40, సీట్ల చొప్పున మొత్తం 80 కేటాయించారన్నారు. సిర్పూర్ టి, తిర్యాని కెజిబివీ లో సీఈసీ 40 చొప్పున మొత్తం 80 సీట్లు కేటాయించాలని, ఇంటర్ బోర్డు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, త్వరలో ప్రథమ సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ కు  అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.