పలు కాలనీలలో పర్యవేక్షించిన కార్పొరేషన్ మేయర్ పారిజాత రెడ్డి

Published: Monday July 05, 2021
బాలాపూర్, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : పరిసరాలు శుభ్రంగా ఉంటే అందరం ఆరోగ్యంగా, జబ్బుల బారిన పడకుండా ఉంటామని కార్పొరేషన్ మేయర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో  2వ, 3వ, 4వ, 5వ డివిజన్లలో పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం నాడు పలు కాలనీలు పర్యటించిన కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి. అక్కడ ఉన్న కాలనీ వాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..... వినాయక హిల్స్ ఫేస్ వన్, టు, త్రీ, వెంకటేశ్వర కాలనీ, అల్మాస్గూడ కాలనీ వాసులతో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలలో పరిశుభ్రంగా ఉంచుకోవడం తోపాటు చెట్లను నాటి కాలుష్యాన్ని నివారించాలనీ అని చెప్పారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే కాలనీ వాసులు అందరూ ఆరోగ్యంగా ఉండి మనలో రోగనిరోధక శక్తి తో పాటు జబ్బుల బారిన పడకుండా ఉంటామని అన్నారు. కాలనీలలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డివిజన్లలో అభివృద్ధి పనులకు కమిటీ వాళ్లతో పాటు కాలనీ వాసుల ప్రజలు సైతం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ల బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట రెడ్డి, జేనీగే పద్మ ఐలయ్య యాదవ్, రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి, కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు రామిడి శూర కర్ణ రెడ్డి తో పాటు పలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.