పోచారంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

Published: Saturday May 21, 2022
ఘత్కేసర్ (ప్రజాపాలన) : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్
 
ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ కి దగ్గరలో పోచారం మున్సిపాలిటీ లో శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణం కోసం స్థల దాత కి, అలాగే ఆలయ నిర్మాణనికి సహకరించిన పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి అమ్మవారి దయ ఎల్లప్పుడు మన అందరికి ఉంటుందని తెలుపుతూ అమ్మవారి దర్శనం చేసుకున్నామని తెలిపారు...
 
ఈ  కార్యక్రమంలో అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, పోచారం కౌన్సిలర్లు, ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్,BC సెల్ అధ్యక్షుడు బర్ల హరి శంకర్ ముదిరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు...