సబ్ కలెక్టర్ ని నియామకం చేయాలి : బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్

Published: Tuesday July 20, 2021
మెట్ పల్లి, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి) : మెట్ పల్లి డివిజన్ కేంద్రంలో సబ్ కలెక్టర్ ను వెంటనే నియామకం చేయాలని మెట్ పల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొడ్ల రమేష్ కోరారు. సోమవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా సబ్ కలెక్టర్ లేకపోవడంతో పాలన కుంటుపడిందన్నారు. సుమారు 16 నెలలుగా ఇంచార్జి పాలనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సైతం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వెంటనే సబ్ కలెక్టర్ ను నియామకం చేయాలని, మండల పరిషత్ స్థలంలో మినీ సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీరాం శివ, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజీత్, బిజెవైఎం నాయకులు సుంకేట విజయ్ తదితరులు పాల్గొన్నారు.