మహిళలను గౌరవించని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి

Published: Tuesday September 07, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి : మహిళలు అనే గౌరవం లేకుండా సొంత పార్టీ మహిళ నాయకురాలైన తోడే పద్మారెడ్డిని అసభ్య పదజాలంతో తిట్టడం చంపుతానని బెదిరించడం సిగ్గుచేటైన విషయమని, జరిగిన సంఘటనకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెంటనే రాజీనామా చేయాలని బెల్లంపల్లి అఖిలపక్షం డిమాండ్ చేసింది. సోమవారం నాడు స్థానిక సిపిఐ కార్యాలయంలో జేఏసీ అధ్యక్షుడు సూరి బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళ అనే గౌరవం లేకుండా పద్మా రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే పై వెంటనే చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని వారన్నారు. అవినీతిపరుడైన తను తన అనుచరులు చేస్తున్న అక్రమ కార్యకలాపాలకు పద్మా రెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయినందుకు ఆతని తల్లి పద్మా రెడ్డిని దూషించడం, చంపుతానని బెదిరించడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీశారు, వెంటనే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి పద్మా రెడ్డి కి పోలీసు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ. సిపిఐ, పార్టీ తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ టిపి పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.