న్యాయ విజ్ఞాన సదస్సు నాచుపల్లి

Published: Friday October 08, 2021
కొడిమ్యాల, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల నాచుపల్లి గ్రామంలో న్యాయవిజ్ఞాన సదస్సు సర్పంచ్ అంబటి లత తిరుమలేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఎం అరుణ సీనియర్ సివిల్ జడ్జి జగిత్యాల మరియు న్యాయవాదులు ప్రజలకు న్యాయవ్యస్థ గురుంచి మోటార్ వాహనాల గూర్చి, ప్రమాదాల గూర్చి, భూమి వివాదాల గూర్చి, గ్రామంలో అల్లర్లు, గొడవలు చేసుకోకుండా ప్రజలు శాంతిగా పండగలు జరుపుకోవాలని సూచనలు ఇచ్చారు. గ్రామ ప్రజలకు మంచి అవగాహన కలిపించారని ప్రజలు ఇకనుండి న్యాయవాదులు చెప్పిన విధంగా యువత మంచి మార్గంలో నడుచుకోవాలని గ్రామప్రజలను కోరారు. ఇట్టి కార్యక్రమంలో న్యాయవాదులు బండ బాస్కర్ రెడ్డి, డబ్బు లక్ష్మరెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ మేనేని రాజనర్సింగరావు, ఎంపీడీవో పద్మ, ఎస్ఐ మహేందర్ ఉప సర్పంచ్ బొజ్జ నర్సయ్య, ఉప అధ్యక్షుడు రోడ్డ శరత్, వార్డ్ సభ్యులు, మహిళలు ఆఫీస్ సిబ్బంది మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు.