సేవా సదనంలోని చిన్నారులకు పండ్లు పంపిణీ చేసిన స్విమ్మర్ అషోషియేషన్

Published: Wednesday November 24, 2021
మధిర నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : జూనియర్ స్విమ్మర్ ఆవుల శాన్వి పుట్టినరోజు సందర్భంగా డా.వసంతమ్మ సేవా సదనం నందు స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలోస్విమ్మర్ సంతోష్ కుమార్  మానసిక వికలాంగ చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి చిన్న వయసులో ఇటువంటి సేవ కార్యక్రమాలు చేయటం ద్వారా పిల్లలకు మంచి సేవా గుణం అలవడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ చౌదరయ్య, భూక్యా హనుమా సైదులు శీలం శ్రీనివాసరెడ్డి, రెయిన్బో రాంబాబు, వేముల నవీన్ కుమార్, పాములపాటి శ్రీనివాసరెడ్డి, బొడ్డుపల్లి రామకృష్ణ చింతల అప్పారావు మందపల్లి రాంబాబు, మహేష్ మరియు ఇతర స్విమ్మర్ సభ్యులు పాల్గొన్నారు.