సేవా సదనంలోని చిన్నారులకు పండ్లు పంపిణీ చేసిన స్విమ్మర్ అషోషియేషన్
Published: Wednesday November 24, 2021
మధిర నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : జూనియర్ స్విమ్మర్ ఆవుల శాన్వి పుట్టినరోజు సందర్భంగా డా.వసంతమ్మ సేవా సదనం నందు స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలోస్విమ్మర్ సంతోష్ కుమార్ మానసిక వికలాంగ చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి చిన్న వయసులో ఇటువంటి సేవ కార్యక్రమాలు చేయటం ద్వారా పిల్లలకు మంచి సేవా గుణం అలవడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ చౌదరయ్య, భూక్యా హనుమా సైదులు శీలం శ్రీనివాసరెడ్డి, రెయిన్బో రాంబాబు, వేముల నవీన్ కుమార్, పాములపాటి శ్రీనివాసరెడ్డి, బొడ్డుపల్లి రామకృష్ణ చింతల అప్పారావు మందపల్లి రాంబాబు, మహేష్ మరియు ఇతర స్విమ్మర్ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: