ఎల్వోసిని అందజేసిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Saturday March 20, 2021
జగిత్యాల, మార్చి 19 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కార్తీక్ అనారోగ్యంతో భాదపడుతుండగా శస్త్ర చికిత్స నిమిత్తం ముందస్తుగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల విలువగల ఎల్వోసిని మరియు జగిత్యాల మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మద్దికుంట మనోహర్ అనారోగ్యంతో బాధపడగా శస్త్ర చికిత్స నిమిత్తం ముందస్తుగా 1 లక్ష 50 వేల రూపాయల విలువగల ఎల్వోసిని శుక్రవారం రోజున జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్ అర్బన్ జడ్పీటీసీ సంగెపు మహేష్ బీర్పూర్ ప్యాక్స్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు మండల కోప్సన్ మెంబెర్ ఎంఏ ముఖీద్ ఎంపీటీసీలు చిత్తరి స్వప్న శ్రీనివాస్ మోర విజయలక్ష్మి వెంకటేష్ మాజీ ఎంపీటీసీ బాలే  చంద్రశేఖర్ ఫాక్స్ చేర్మెన్ రాజలింగం ఉప సర్పంచ్  సాగర్ రావు తెరాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షడు రత్నాకర్ రావు ఓరుగంటి భీంరాజ్  వెంకట్ రెడ్డి రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.