*షాబాద్ ప్రభుత్వ దావఖానాలో వైద్యుల నిర్లక్ష్యం: -ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన వైద
చేవెళ్ల ఫిబ్రవరి 15 (ప్రజా పాలన):-
చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలోని డిప్యూటీ తహసిల్దార్ గారికి అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షాబాద్ కేంద్రంలోని ప్రభుత్వ దావఖానాలోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవఖానాలోని ప్రజల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని అంబేద్కర్ ప్రజా సంఘంగా తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, నిర్లక్ష్యం వహించే వైద్య సిబ్బందిపై సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చేవెళ్ల మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రంగపురం వెంకటేష్, షాబాద్ మండల జాయింట్ సెక్రెటరీలు నీరటి యాదయ్య, చర్లగూడెం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: