రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Friday February 19, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 18 (ప్రజాపాలన: జగిత్యాల అర్బన్ మండల్ అంబారిపెట్ కల్లెడ పొలాస రైతు వేదికలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మోతే గ్రామానికి చెందిన రైతు కనుక లక్ష్మణ్ ఇటీవల మరణించగా లక్ష్మణ్ భార్య కనుక రాజేశ్వరికి 5 లక్షల చెక్కును మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి రూరల్ ఎంపీపీ గజర్ల గంగారాం గౌడ్ అర్బన్ ఎంపీపీ మెదరి అనిత జడ్పీటీసీ సంగెపు మహేష్ ఏఎంసి చైర్మన్ దామోదర్ రావు ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి  రైతుబంధు కో ఆర్డినేటర్ జుంబర్తి శంకర్ సర్పంచ్ గంగాధర్ ఎంపీటీసీ మల్లారెడ్డి రైతు బంధు సమితి నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.