తెలంగాన ఉద్యమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రేస్ కు లేదు
Published: Friday August 20, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాన ఉద్యమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రేస్ పార్టీ నాయకులకు లేదని టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమ కారులు జానిపాషా అన్నారు. ఉద్యమ నాయకుల పైన తుపాకీ ఎక్కి పెట్టిన రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ను తెలంగాణ సమాజం ఎప్పుడో దూరం పెట్టిందని సరియైన సమయానికి మీ పార్టీ స్పందించి ఉంటే 1200 మంది అమరుల అయ్యే వారే కాదన్నారు. మీ ఉనికి కోసం మీరు మీటింగ్ పెట్టుకోండి కానీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృధ్ధి కోసం నిరంతరం ప్రజా సేవలో తపించే ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో యువతకు ఎం కె ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తు నిరంతరం అందరికి అందుబాటులో ఉండే యువ నాయకులు మంచి రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పైన అవాకులు చెవాకులు పేలుతే కబర్దార్ చూస్తూ ఊరుకోం మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోండి జాని భాష అన్నారు.
Share this on your social network: