క్షతగాత్రులను పరామర్శించిన బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

Published: Monday November 21, 2022

 వికారాబాద్ బ్యూరో 20 నవంబర్ ప్రజా పాలన : వికారాబాద్ ఆర్టీసీ బస్సు ప్రమాద బాధితులను పరామర్శించామని బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి నిండు గర్భిణిలా ఉన్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. రోడ్డు ప్రమాదంలో  గాయపడి.. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ తో కలిసి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించడం జరిగింది. వీరితోపాటు వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్  ఉన్నారు.