జర్నలిస్టు రఘు ను సన్మానించిన పలువురు నాయకులు

Published: Friday July 02, 2021

మంచిర్యాల టౌన్, జూలై 01, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా లో స్థానికంగా ఏర్పాటు చేసిన సమవేశంలో జర్నలిస్ట్ రఘు ను పలువురు నాయకులు సన్మానించారు ఈ సందర్భంగా రఘు స్థానిక ప్రజలతో నాయకులతో మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న అన్యాయాలు ,అక్రమాలు, భూకబ్జాలు, ఇసుక మాఫియా, పోలీసుల, అధికారుల పనితీరుపాత్ర అన్ని విషయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. మరోసారి జిల్లా కేంద్రానికి వస్తానని ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగడాలను అక్రమాలను బయటపెడతానని చెప్పారు,కెసిఆర్ అరాచక పాలనలో జర్నలిజం బందీ అయ్యిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కెసిఆర్ నిజస్వరూపాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచటానికి నేను అన్ని జిల్లాల పర్యటన చేస్తున్నానని అన్నారు. తెలంగాణ సమాజాన్ని ఎంత అణచి వేసిన రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమిస్తారు ప్రజలు అని అన్నారు. ఆంధ్ర పాలకుల మెడలు వంచిన తెలంగాణ ప్రజలకు కెసిఆర్ ను గద్దె దించడం పెద్ద పనేం కాదని అన్నారు. ఈ రాక్షస పాలన విముక్తి కొరకై ప్రజలందరూ మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదనరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నల్ల నాగేంద్ర ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు తులా ఆంజనేయులు, చింతకింది తిరుపతి, చంద్రగిరి నరేష్, సోమ ప్రదీప్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.