*చేవెళ్ల డివిజన్ స్వేరో నూతన కమిటీ ఎంపిక*

Published: Saturday January 21, 2023
చేవెళ్ల జనవరి 20, (ప్రజాపాలన):-1

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని విశ్రాంతి భవనం లో డివిజన్ కమిటీనీ   రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాస్ ఎన్నుకున్నారు.  ఈ సందర్బంగా  వారు  మాట్లాడుతూ స్వేరోస్ ఫౌండర్ అయిన *డాక్టర్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి* త్యాగాలను మరియు స్వేరోస్ నినాదాలని తెలిపారు. అక్షరం ఆర్థికం ,ఆహారం అంటూ .పేద బడుగు బలహీన వర్గాల  పేద విద్యార్థులకు అండగా ఉంటామని స్వేరోస్ యొక్క గొప్పతనాలను, వాళ్ళు చేసిన త్యాగాలను , నూతన కమిటీ నాయకులకు తెలియజేసారు. ఈ సందర్భంలో నూతన కమిటీ అధ్యక్షుడిగా పవన్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి  ఆకాష్ లను ఎన్నుకోవడం ఎన్నుకున్నారు
ఈకార్యక్రమంలో   స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ మండల నాయకులు పాల్గొన్నారు.