గిరిజన వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు శిక్షణ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ
వికారాబాద్ బ్యూరో 26 మే ప్రజాపాలన : గిరిజనుల అభివృద్ధి, పరిశ్రమల బలోపేతానికి జిల్లా గిరిజన వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు "మెంటర్ షిప్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపారాలలో రాణించేందుకు ఆర్థిక లావాదేవీలు సంక్రమంగా నిర్వహించేందుకు, అభివృద్ధి పథంలో పరిశ్రమలు బలోపేతానికి గిరిజనులకు సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేంకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అయన పేర్కొన్నారు. అంతేకాకుండా అవసరమైన వారికీ బ్యాంకుల ద్వారా రుణాలను కూడా మంజూరు చేయించనున్నట్లు అయన తెలియజేసినారు. జిల్లాలోని గిరిజన వ్యాపార, పారిశ్రామిక వేత్తలు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 30 న 11:00 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆవరలోని రూమ్ నం :10 లో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8464006666, 9908120296 లను సంప్రదించాలని తెలియజేసినారు.
Share this on your social network: