గీతా కార్మికుల సంక్షేమానికి కృషి--ఎమ్మేల్యే డా. సంజయ్ కూమార్

Published: Wednesday July 27, 2022

రాయికల్, జూలై 26 (ప్రజాపాలన ప్రతినిధి):
గీతా కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలాన్ని ధర్మపురి ఆబ్కారీసర్కిల్ నుంచి జగిత్యాల సర్కిల్ పరిధికి మార్చినందుకు
రాయికల్ పట్టణంలోని మండలక్లబ్ ఆఫ్ రాయికల్ లో మంగళవారం రాయికల్ పట్టణ ,మండల గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఘనంగాసన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ గీతా కార్మికులుప్రమాదవశాత్తు మృతిచెందిన,అంగవైకల్యం పొందిన వారికి గత ప్రభుత్వాల కంటే  ఎక్స్ గ్రేషియోపెంచి ఇప్పటికే పలువురికి అందజేశామని పేర్కొన్నారు.
వయసు దాటిన గీతా కార్మికులకు పింఛను కల్పిస్తున్నామని,తమ ప్రభుత్వం గీత కార్మికులకు అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి,రాయికల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పబ్బం కిరణ్ కుమార్ గౌడ్,
మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుకొలశ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి రాజేష్, గౌడ సంఘం సభ్యులు,గీతా కార్మికులు,సర్పంచులు, ఎం.పీ.టీ.సీలు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.