కుసుకుంట్ల గెలుపు ఖాయం

Published: Thursday October 20, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి):
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి 14వ వార్డు లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటింటికి తిరిగి టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపియాలి అన్నారు, తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబము ఏదో విధంగా లబ్ధి పొందుతున్నారు, కెసిఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు, గొర్రె కాపరులకు నగదు బ్యాంకులో బదిలీ చేయడం జరిగింది అన్నారు, మునుగోడు లో జరిగే ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు, ఈ కార్యక్రమంలో 14వ వార్డు అధ్యక్షుడు ఉడుగు రమేష్ చౌటుప్పల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం వర్కాల రవి జర్రిగల జానీ దొడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు.