యూనిఫాం పంపిణీచేసిన ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు.. తల్లాడ, డిసెంబర్ 5 (ప్రజా పాలన న్యూస్):

Published: Tuesday December 06, 2022

 మండలంలోని ఆశా కార్యకర్తలకు తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ఆదివారం యూనిఫాంలో పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి డాక్టర్ నవ్య కాంత్ ఆధ్వర్యంలో 57 మంది ఆశ వర్కర్లకు వీటిని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఆశా వర్కర్లు కరోనాకాలంలో కూడా కష్టపడి వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రభుత్వ నుండి వచ్చిన రెండు జతల యూనిఫాములను మహిళలకు అందించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ సొసైటీ చైర్మన్ రెడ్డేం వీర మోహన్ రెడ్డి, ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ నవ్య కాంత్, డాక్టర్ జ్యోతి, సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య, సిహెచ్ఓ భాస్కర్, నాయకులు దుగ్గిదేవర వెంకటలాల్, గరిడేపల్లి వెంకటేశ్వరరావు జి.వి.ఆర్, శీలం కోటారెడ్డి, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.