మెరిట్ స్కాలర్షిప్ టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కేజీబీవీ పాఠశాల విద్యార్థులు
Published: Saturday March 11, 2023
బోనకల్, మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో కెజిబివి పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థినీ అయినా మానస ,ప్రకాశం జిల్లా, చిన్న గండమే మండలం సంతరావూరు గ్రామస్తుడైన నూనె రాజశేఖర్ వారి కుమారుడైన నూనె లక్ష్మణ్ బాబు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మెరిట్ స్కాలర్ ఫిష్ టెస్ట్ లో మానస అత్యుత్తమ ప్రతిభ కనపరచి మొదటి బహుమతి 10000 రూపాయలు,10,000 రూపాయలు మానె లక్ష్మణ్ బాబుకు జి సి డి ఓ ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ చేతుల మీదగా బహుమతిని అందజేసినారు. వీరిని కేజీబీవీ పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలోజి సి డి ఓ ఉపాధ్యాయురాలు ఉదయశ్రీ ,స్పెషల్ ఆఫీసర్ బి కమల హాసిని, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: