రక్షణ గిరి పుణ్యక్షేత్రం మహోత్సవాలు ప్రారంభం...

Published: Wednesday February 02, 2022
ఎర్రుపాలెం ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని అయ్యవారి గూడెం గ్రామంలో రక్షణ గిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలను ఫాదర్ కుడుం తామస్ చేతుల మీదగా పతాకావిష్కరణ చేసి ప్రారంభించారు. అనంతరం భక్తుల అవసరాల కోసం నిర్మించి నటువంటి స్నానపు గదులను ప్రారంభించిన సిస్టర్ ఆంటోనియా, మిస్టర్ అమల, సిస్టర్ రీనా. అనంతరం పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ సూరేపల్లి ఐజాక్ అధ్యక్షతన ఫాదర్ కురివి తామస్ చేతులమీదుగా దివ్య బలి పూజ ను నిర్వహించారు. కురివి తామస్ మాట్లాడుతూ మరియమ్మ గారి గొప్పతనాన్ని ఆమె చేసే అద్భుతాలను మరియమ్మ గారి పవిత్ర విశిష్టతను గురించి ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఏసురత్నం, ఫాదర్ రమేష్ పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ఐజాక్, సంఘ పెద్దలు సంఘస్తులు పాల్గొన్నారు.