నవంబర్ 21 న 9వ ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ సభను విజయవంతం చేయండి : గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిర
Published: Friday November 18, 2022
నవంబర్ 21 న బండ ప్రకాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరగనున్న మత్స్య కార దినోత్సవం, ముదిరాజ్ మహాసభ 9వ వార్షికోత్సవంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ముదిరాజ్ మహాసభ యువజన విభాగం నాయకుడు గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్.ఆ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు
కేటీఆర్, తలసాని, మహామూద్ అలీ లు పాల్గొననున్నారన్నారు.21 న ప్రతీ గ్రామం లో ముదిరాజ్ లు ఆత్మగౌరవ జెండా ఎగరేసి సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ కు ధన్యవాదాలు తెలిపారు.వార్షికోత్సవం సందర్బంగా మొగిలయ్య, బిత్తిరి సత్తి, జబర్దస్త్ అవినాష్, మర్రి లక్ష్మి,కనకవ్వ, పాండు ముదిరాజ్, పిట్టల రాజారమేష్, సందీప్, హారిక, తీన్మార్ వార్తలు లోని చంద్రవ్వ లను సన్మానించబోతున్నట్లు ఆయన తెలిపారు.ముదిరాజ్ హక్కుల కొరకు పాటుపడుతున్న ముదిరాజ్ మహాసభ కు అండగా ఉండాలని ఆయన ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ లను కోరారు.ఈ కార్యక్రమం లో గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, ప్రొఫెసర్ దినేష్ కుమార్, అల్లుడు జగన్ ముదిరాజ్, మర్రి ప్రభాకర్, చంద్రశేఖర్, కనకయ్య, బొక్క శ్రీనివాస్, అంబర్ పేట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: