రోడ్డు ప్రమాదంలో గాయపడిన పరామర్శించిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు మారగోని జంగయ్య

Published: Tuesday September 07, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి : వైయస్సార్ పార్టీ నాయకుడు జొన్నడ సహాదేవ్ ను పరామర్శించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ మంచాల మండలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ0 కొయ్యడ గ్రామానికి చెందిన వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకుడు జొన్నడ సహదేవ్ పదహారు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు కాళ్ళు చచ్చు పడిపోయి విల్ చైర్ కె పరిమితం అయి ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సహదేవ్ ను వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ జొన్నడ సహదేవ్ వైయస్సార్ వీర అభిమాని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ0 కొయ్యడ గ్రామం నుండి సైకిల్ యాత్ర చేసుకుంటు ఇడుపులపాయకు వెళ్లి వైయస్సార్ ఘాట్ ను దర్శించుకున్నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కొయ్యడ నుండి ఎంపీటీసీ గా పోటీ చేసాడు సహదేవ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గా పని చేసాడు అలాంటి వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు చచ్చు పడి పోవటం చాలా బాధాకరం లక్షలు ఖర్చు పెట్టి కేరళ రాష్టంలో  మూడు నెలలు ఆయుర్వేదిక్ వైద్యం చేయించు కున్నాడు కళ్ళకు కాస్తా చలనం వచ్చింది కానీ నడవలేడు సర్జరీ చేస్తే తప్పకుండా నడవ గలుగుతావు అని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు టెస్టులు చేసి చెప్పటంతో ప్రసుతం సర్జరీ కి సంబంధించిన ట్రీట్ మెంట్ చేయించు కుంటున్నాడు సహదేవ్ కు సర్జరీ విజయవంతం అయ్యి మళ్ళీ మా అందరి మధ్యన తిరగలని మాతో కలిసి నడవాలని ఆ భగవంతుని మనసు పూర్తిగా కోరుకుంటున్న జొన్నడ సహదేవ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైయస్సార్ తెలంగాణ పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళుతా అన్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ జొన్నడ సహదేవ్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది అన్నారు.