హైదరాబాద్ ఏప్రిల్ 12 ప్రజాపాలన:
Published: Thursday April 13, 2023
**హనుమంతపూర్ గ్రామ పంచాయతీ లో కంటి వెలుగు వైద్య శిబిరం ప్రారంభిచిన గ్రామ సర్పంచ్ పగడాల విజయ నర్సయ్య**
12.04.2023 నుండి 24.04.2023 వరకు అన్ని పని దినాలలో కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేసారు దీనిని ప్రజలందరు వినియోగించుకోవాలని పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ తాల్క తెలిపారు. ఈ
కంటి వెలుగు శిబిరం లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ల అద్దాలు , మందులు, దూరపు మరియు దగ్గర చూపు ఉన్న వారికి ప్రిస్క్రిప్షన్ ఆర్డర్ అద్దాలు, మందులు పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి టి. గోవర్ధన్ , గ్రామ సర్పంచ్ పగడాల విజయ నర్సయ్య , జడ్పీటిసి యం.శ్రీనివాస్ మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది తో కలిసి ప్రారంభించారు. ఈ కంటి వెలుగు కార్యక్రమంను ప్రజలందరు వినియోగించుకొని వారి కంటి సమస్యలను నివారించుకోవాలని డాక్టర్ కిషోర్ తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో క్యాంపు టీం లీడర్ డాక్టర్. ఝాన్సీ ,ఆరోగ్య పర్యవేక్షణాధికారి భాగ్యమ్మ , ఆప్టోమెట్రిస్ట్ కరుణాకర్, డేటా ఆపరేటర్ ముజమ్మిల్, ఎఎన్ యం సునంథ, లావణ్య, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: