ట్రంక్ లైన్ సమస్య పరిష్కారం

Published: Monday May 24, 2021
బాలపూర్, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీధర్ కాలనీలో ట్రంక్ లైన్ సమస్యను శాశ్వత పరిష్కారం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 వ డివిజన్ టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ మామిడి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని బోకే ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు. ట్రంక్ లైను పనులను అతి త్వరలో మొదలు పెట్టగలరని సంబంధిత అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో పల్లె పాండు గౌడ్, సిద్ధాల బాలప్ప, బండి నాగేష్, వంటెరు నరసింహారెడ్డి, మల్లారెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ కాలనీ అధ్యక్షుడు మల్లారెడ్డి కాలనీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.