25న ప్రారంభం కానున్న నూతన రంగారెడ్డి జిల్లా సమీకృత భవనం*
Published: Thursday August 25, 2022
ఇబ్రహీపట్నం ఆగస్టు తేదీ 24 ప్రజా పాలన ప్రతినిధి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కాలన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొనడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం మంచిరెడ్డి కిషన్ రెడ్డి అని ఆదిభట్ల మున్సిపల్ 5వార్డ్ కౌన్సిలర్ వనం శ్రీనివాస్ తెలిపారు అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కలన్ లో ఏర్పాటు చేయడం అర్శించదగ్గ విషయం ఇట్టి కార్యాలయము రంగారెడ్డి జిల్లా నలుమూలలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఓరార్ పక్కనే అందరికీ సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కలెక్టరేట్ కార్యాలయానికి సహకరించిన మంత్రులకు ఎమ్మెల్యేలకు పార్టీ శ్రేణులకు ముఖ్యంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు.
Share this on your social network: