*శాలివాహన పవర్ ప్లాంట్ ను కొనసాగించాలి

Published: Wednesday September 21, 2022

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 20, ప్రజాపాలన : శాలివాహన పవర్ ప్లాంట్ ను కొనసాగించలనీ శాలివాహన పరిరక్షణ సమితి ఆధ్వ్యంలో మంగళవారం రోజున మంచిర్యాల శాసనసభ్యులు నడిపెళ్లి దివాకర్ రావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ శాలివాహన బయోమాస్ పవర్ ప్లాంట్ గ్రీన్ ఎనర్జీ కంపనీ, మంచిర్యాల పవర్ పర్చేస్ అగ్రిమెంట్ 2022 డిసెంబర్ 7 వ తేదీన ముగుస్తున్నందున ఈయొక్క పి.పి.ఏ ను మరో పది సంవత్సరాల పాటు పొడిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి, కంపెనీపై ఆధారపడ్డా మూడు వందలకు  పైబడిన  కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ రావు,ఎడ్ల శ్రీనివాస్, చెట్టి శ్రీనివాస్, కుంటాల శంకర్,నిమ్మరాజుల సత్యనారాయణ, కాయితి శ్రీనివాస్,కనుకుంట్ల సుదీర్,  కార్మికులు పాల్గొన్నారు.