ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Saturday July 23, 2022

జగిత్యాల, జూలై 22  ( ప్రజాపాలన ప్రతినిధి): పావని కంటి ఆసుపత్రి లో అపి, రోటరీ క్లబ్ సహకారం తో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 25 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ నిర్వహించినారు. వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేసినారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ల రాజన్న, కూతురు శేకర్, వెంకటేష్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, తదితరులు ఉన్నారు.