వివాహ శుభకార్యంలో పాల్గొన్న కొండబాల

Published: Monday May 16, 2022
బోనకల్, మే 15 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని
రావినూతల గ్రామ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు గ్రామ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోతు కృష్ణ కుమారుడు రాకేష్ వివాహమునకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అదే గ్రామంలో 11వ వార్డు మెంబర్ భానోత్ బేబీ భర్త నాగేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరగడంతో వారి స్వగృహం నందు వచ్చి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రావినూతల గ్రామ సర్పంచి కొమ్మినేని ఉపేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు,రాపల్లి గ్రామ సర్పంచ్ మందడపు తిరుమల రావు, గ్రామ మాజీ సర్పంచ్ షేక్ వజీర్, మృత్య శాఖ జిల్లా అధ్యక్షులు బొమ్మకంటి సైదులు, డివిజన్ నాయకులు షేక్ సైదా,ఆర్ఎంపి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ జె డి మూర్తి, షేక్ జానీ , పరసగాని మల్సూర్ , బానోతు కృష్ణ , భానోత్ వెంకటేశ్వర్లు, బానోతు లాలూ, బోయినపల్లి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.