పలు కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన : మేయర్

Published: Wednesday August 25, 2021
బాలాపూర్: ఆగస్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ అభివృద్ధిలో ముందుంటుందని మేయర్ అన్నారు. బడoగ్ పెట్ కార్పొరేషన్ పరిధిలోని నాదరుగుల్ 9వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల సునితా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఎం వి ఎస్ ఆర్ కాలేజ్ దగ్గర డ్రైనేజీ, అదేవిధంగా ఓల్డ్ విల్లేజ్ లో సి సి రోడ్డు ను కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.... దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని, కార్పొరేషన్ ను అభివృద్ధి చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల్ తోట శ్రీధర్ రెడ్డి, గుడెపు ఇంద్రసేన, ఏ ఈ రాంప్రసాద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.