ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Thursday June 10, 2021

బెల్లంపల్లి, జూన్ 9, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్ గంలోని, భీమిని, నెన్నేల, మండల కేంద్రాలలో 16 లక్షలతో నిర్మించతలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దుర్గం  చిన్నయ్య. బుధవారం నాడు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలైన భీమిని, నెన్నెల, మండల కేంద్రాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలకు16 లక్షలతో ఎప్పుడో ప్రతిపాదనలు చేస్తే ఇప్పుడు మంజూరయ్యాయని వీటి నిర్మానం పూర్తి చేసు కొని ప్రజలు వీటిని వినియోగించుకొని వైద్య సదుపాయాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.