ప్రజలపై భారం మోపుతున్న బిజెపి ప్రభుత్వం

Published: Friday June 25, 2021

వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు, తగ్గించాలి

ఆసిఫాబాద్ జిల్లా, ప్రతినిధి జూన్ 24 (ప్రజాపాలన) : దేశంలో పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి, అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజల పై ధరలు పెంచి పెను భారం మోపుతోందని, వామపక్షల ఆధ్వర్యంలో janaka పూర్ లోని పెట్రోల్ బంక్ ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వామపక్ష జిల్లా నాయకులు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు మరియు పెట్రోల్, డీజిల్, ధరలు విపరీతంగా పెంచి బిజెపి ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపు తుందన్నారు. బిజెపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని, తక్షణమే దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్ సిలిండర్ల, ధరలు తగ్గించాలని బిజెపి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి, సిపిఎం జిల్లా నాయకులు గోడిసెల కార్తీక్, బొర్కుటే శ్యామ్ రావు, రాజ్ కుమార్, రవీందర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.